తుక్కుగూడ : నిరుద్యోగ యువతకు పట్లోళ్ల ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అనేక రకాలుగా చేయూతనందిస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం నిర్వహించనున్న ఉచిత శిక్షణా తరగతుల వాల్పోస్టర్ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని యువతీ యువకుల కోసం తుక్కుగూడలోని కళాశ్రీ గార్డెన్స్లో 2 నెలల పాటు ఈ ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఎస్సై, కానిస్టేబుల్, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు పోటీ పరీక్షలకు హాజరయ్యే నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 31వ తేదీ నుంచి తుక్కుగూడ కళాశ్రీ గార్డెన్స్లో శిక్షణా తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అడ్మిషన్ల కోసం 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు, ఇంటర్ మెమో, ఆధార్కార్డు జిరాక్స్ కాపీలను జతచేసి కళాశ్రీ గార్డెన్స్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 94930 28040 నంబర్లో సంప్రదించాలని కోరారు. తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ కాటేంకార్ మధుమోహన్, పట్లోళ్ల ఇంద్రారెడ్డి ట్రస్ట్ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.