న్యూఢిల్లీ: ఇండో పాక్ బోర్డర్(India-Pakistan Border) రాత్రి పూట వెలిగిపోతోంది. సరిహద్దుల్లో విద్యుత్తు లైట్లు ధగధగలాడుతున్నాయి. ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉన్న రాడ్క్లిఫ్ లైన్ బోర్డర్ వద్ద ఇరు వైపులా విద్యుత్తు లైట్లు మెరిసిపోతున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. ఇండిగో పైలట్ ఆ వీడియోను షేర్ చేశారు. దట్టమైన చీకట్లో.. విద్యుత్తు కాంతులతో సరిహద్దు మెరిసిపోతున్నట్లు ఆ పైలట్ తన వీడియోలో తెలిపారు. కెప్టెన్ ప్రదీప్ కృష్ణన్ ఓ అరుదైన ఫూటేజ్ను పోస్టు చేశారు. అర్థరాత్రి వేళ విమానంలో ప్రయాణిస్తున్న వారికి ఆ అద్భుత క్షణాలను ఎంజాయ్ చేసే అవకాశాన్ని పైలట్ కల్పించారు. ఎల్లో రంగులో ఉన్న ఫ్లడ్ లైట్లు చాలా సుదీర్ఘంగా దూరంగా ఉన్నట్లు కనిపించాయి. బోర్డర్ మెరుపుల గురించి విమాన ప్రయాణికులకు కెప్టెన్ కృష్ణన్ ప్రకటన చేశారు.విమాన కిటికీల్లోంచి బయటకు చూస్తే, చాలా సున్నితమైన, సురక్షితమై ప్రదేశానికి చేరుకున్నట్లు అనిపిస్తుందన్నారు. కట్టుదిట్టమై రక్షణ ఉన్న బోర్డర్ను చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సరిహద్దుల్లో వరుస క్రమంలో ఉన్న లైట్లను చూసి ప్రయాణికులు సంతోషానికి లోనయ్యారు. ఇక ఆ వీడియోకు ఆన్లైన్లో కామెంట్లు వస్తున్నాయి.