జమ్ము: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సరిహద్దుల్లో భారత్, పాక్ సైనికులు మిఠాయిలు పంచుకొన్నారు. రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం కొనసాగాలని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. పూంఛ్ జిల్లాలో రావల్కోట్ క్రాసింగ్ పాయింట్ వద్ద భారత ఆర్మీ పాక్ సైనికులకు స్వీట్లు పంచారు. చినా జ్, చంబిలియాల్ ఏరియాల్లో బీఎస్ఎఫ్ జవాన్లు, పాకిస్తాన్ రేంజర్లు పరస్పరం స్వీట్లు పంచుకొన్నారు.