న్యూఢిల్లీ: రూపాయి కరెన్సీలో ఇరుదేశాల వర్తక, వాణిజ్య లావాదేవీలు నిర్వహించడానికి భారత్, మలేషియా సిద్ధమైనట్టు భారత విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. ఇతర కరెన్సీలతోపాటు, రూపాయితో అంతర్జాతీయ వర్తక, వాణిజ్య లావాదేవీలు చేపట్టాలని గత జూలైలో ఆర్బీఐ నిర్ణయించింది.
అంతర్జాతీయ వాణిజ్య వృద్ధి, రూపాయితో లావాదేవీలు చేపట్టే కంపెనీల ప్రయోజనాలకు మద్దతు పలకాలన్నదే ప్రధాన ఉద్దేశమని విదేశీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘భారత్లోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఖాతా (వోస్ట్రో ఖాతా) ద్వారా చెల్లింపుల ప్రక్రియకు కౌలాలంపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఇండియా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా అన్ని ఏర్పాట్లు చేసింది’ అని పేర్కొన్నది.