న్యూఢిల్లీ/ఖార్తోమ్: ఆఫ్రికా దేశమైన సుడాన్లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య భీకర పోరు జరుగుతున్నది. ఇప్పటికే సుమారు 500 మంది వరకు సాధారణ పౌరులు మరణించగా, 3,500 మంది గాయపడ్డారు. మృతుల్లో కొందరు భారతీయులు కూడా ఉన్నారు. సంక్షోభంలో ఉన్న సుడాన్లో సుమారు 4,000 మంది భారతీయులు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిని సురక్షితంగా భారత్కు తరలించేందుకు ‘ఆపరేషన్ కావేరి’ (Operation Kaveri) మిషన్కు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సుమారు 500 మంది భారతీయులు సుడాన్ పోర్ట్కు చేరుకున్నారు. భారత నౌకా దళానికి చెందిన ఐఎన్ఎస్ సుమేధ ఇప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్నది. సుడాన్లో చిక్కుకున్న భారతీయులను ఐఎన్ఎస్ సుమేధ, ఐఏఎఫ్ విమానాల ద్వారా భారత్కు తరలించే ప్రక్రియ సోమవారం ప్రారంభమైందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఈ మిషన్ను ‘ఆపరేషన్ కావేరి’గా పేర్కొన్నారు.
కాగా, వార్ జోన్ దేశాలైన ఆఫ్ఘనిస్థాన్, ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులతోపాటు విదేశీయుల తరలింపునకు ‘ఆపరేషన్ కావేరీ’ మిషన్ను భారత్ చేపట్టింది. తాజాగా సుడాన్ నుంచి భారతీయులు, ఇతర దేశీయుల తరలింపునకు మిత్ర దేశాలతో కలిసి ఈ మిషన్ను కొనసాగిస్తున్నది. సోమవారం ఫ్రాన్స్ కూడా సుడాన్ నుంచి 388 మందిని తరలించింది. ఐదుగురు భారతీయులతోపాటు 28 దేశాలకు చెందిన వారిని సురక్షిత ప్రాంతాలకు చేర్చింది.
Operation Kaveri gets underway to bring back our citizens stranded in Sudan.
About 500 Indians have reached Port Sudan. More on their way.
Our ships and aircraft are set to bring them back home.
Committed to assist all our bretheren in Sudan. pic.twitter.com/8EOoDfhlbZ
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 24, 2023