న్యూఢిల్లీ: అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్తో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఇండో పసిఫిక్ ప్రాంతం తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు అమెరికా రక్షణ మంత్రి తెలిపారు. ఆ ప్రాంత అంశంలో భారత్ కీలక భాగస్వామి అని ఆయన అన్నారు. ఒకే విధమైన ఆలోచన ఉన్న ఇద్దర మధ్య సైనిక సహకారం కీలకమని ఆస్టిన్ చెప్పారు. అంతర్జాతీయ పరిణామాలు మారుతున్నాయని, అమెరికాతో భారత్ భాగస్వామ్య ప్రాముఖ్యత పెరుగుతోందని లాయిడ్ తెలిపారు. రెండు దేశాల నేతలు సంయుక్త ప్రకటన చేశారు. రెండు దేశాల మధ్య సైనిక సంబంధాలను పెంచే అంశంపై దృష్టి పెట్టామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. చర్చలు ఫలప్రదంగా సాగాయన్నారు. సమగ్రమైన వ్యూహాత్మక భాగస్వామి సామర్థ్యాన్ని గుర్తిస్తున్నామని ఆయన అన్నారు. భారత రక్షణ రంగంలో ఎఫ్డీఐలను ఆహ్వానిస్తున్నట్లు ఈ సందర్భంగా రాజ్నాథ్ తెలిపారు. ఇటీవల మిగ్21 కూలిన ఘటనలో మృతిచెందిన పైలట్కు అమెరికా రక్షణ మంత్రి నివాళి అర్పించారు.