దుషాన్బే: తజికిస్థాన్లో పూర్తి సౌకర్యాలతో ఆధునీకరించిన 50 పడకల ఆసుపత్రిని ఆ దేశానికి భారత్ అప్పగించింది. ఆ దేశ రాజధాని దుషాన్బే సమీపంలోని బోక్తార్లో ఇండియా-తజికిస్థాన్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ (ఐటీఎఫ్హెచ్)ను 2014 అక్టోబర్లో భారత్ ప్రారంభించింది. ఎనిదేళ్లుగా వైద్య సేవలందిస్తున్న ఈ ఆసుపత్రి పునరుద్ధరణ పనులను భారత్ ఇటీవల పూర్తి చేసింది. అత్యంత ఆధునిక వైద్య సౌకర్యాలతో 50 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దింది. సర్జరీ, గైనకాలజీ, మెడిసిన్, పీడియాట్రిక్స్, ఈఎన్టీ, డెంటల్ సహా అనేక వైద్య విభాగాలు, ఆధునాతన వైద్య పరికాలను ఏర్పాటు చేసింది. ఆపరేషన్ థియేటర్, ఎక్స్-రే యంత్రాలు, ల్యాబరేటరీ, క్రిటికల్ కేర్ అంబులెన్స్లు, ఇతర వాహనాలతో సహా పూర్తి సౌకర్యాలతో కూడిన ఇండియా-తజికిస్థాన్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ (ఐటీఎఫ్హెచ్)తోపాటు దాని నిర్వాహణ బాధ్యతలను జూన్ 11న ఆ దేశానికి భారత్ అందజేసింది. ఈ సందర్భంగా ఇరు దేశాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, ఎలాంటి లాభాపేక్ష లేకుండా స్నేహ పూర్వక దేశాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే భారత విధానానికి అనుగుణంగా తజికిస్థాన్తో కలిసి భారత్ నిర్మించిన ఈ హాస్పిటల్ ద్వారా ఇప్పటికే ఆ దేశ ప్రజలకే కాకుండా సైనికులకు కూడా ఉచితంగా వైద్య సేవలను అందిస్తున్నారు. 2014 అక్టోబర్లో ప్రారంభైన ఈ ఆసుపత్రి ద్వారా గత ఏనిమిదేళ్లలో లక్షకుపైగా రోగులు చికిత్స పొందారు. గత రెండేళ్లలో సుమారు రెండు వేలకుపైగా సర్జరీలు జరిగాయి. ఇండియన్ ఆర్మీ వైద్యులు, వైద్య సిబ్బంది బృందం తజిక్ ప్రజలకు వైద్య సేవలందించారు. అలాగే తజికిస్థాన్ వైద్యులు, వైద్య సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. దీంతో ఆ దేశ వైద్యులు, సిబ్బంది సంఖ్య పెరుగడంతో అక్కడ సేవలందిస్తున్న భారత వైద్యులు, సిబ్బంది సంఖ్య 72 నుంచి 24కు తగ్గింది.
మరోవైపు ఇండియా-తజికిస్థాన్ ఫ్రెండ్షిప్ హాస్పిటల్ (ఐటీఎఫ్హెచ్)ను భారత్ ఇటీవల మరింతగా అభివృద్ధి చేసింది. సొంత నిధులతో ఆధునిక వైద్య పరికరాలు, సామగ్రితో పాటు అన్ని సౌకర్యాలను సమకూర్చింది. దీంతో 50 పడకలతో పూర్తిగా తీర్చిదిద్దిన ఆసుపత్రితోపాటు ఇప్పటి వరకు చూస్తున్న నిర్వాహణ బాధ్యతలను కూడా తజకిస్థాన్కు భారత్ అప్పగించింది.