న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య మరోసారి కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ వాణిజ్య విమానాలపై విధించిన నిషేధాన్ని కేంద్రం పొడగించింది. ఫిబ్రవరి 28వ తేదీ వరకు షెడ్యూల్డ్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులపై సస్పెన్షన్ ఉంటుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) బుధవారం తెలిపింది.
ఇంతకు ముందు డిసెంబర్లో జనవరి 31 వరకు నిషేధాన్ని పొడగించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులతో పాటు ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో తాజాగా నిర్ణయం తీసుకున్నది. అయితే ఎయిర్ బబుల్ ఒప్పందాలు, అంతర్జాతీయ ఎయిర్ కార్గో విమానాలకు ఈ నిబంధనలు వర్తించవని ఇంతకు ముందు మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.