న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత ఆర్థిక వృద్ధి 9.27 శాతంగా ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇవాళ ఆమె లోక్సభలో 2022-23 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ.. పౌరుల కేంద్రం సంస్కరణలు చేపట్టేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉందన్నారు. రాబోయే 25 ఏళ్ల అమృత కాలానికి దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు సంస్కరణలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం మనం ఒమిక్రాన్ వేవ్ మధ్యలో ఉన్నామని, కానీ మన దేశంలో వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ సాగుతున్నట్లు మంత్రి చెప్పారు. అందరిక సహకారంతో ఆర్థిక వృద్ధి బలంగా సాగుతుందని ఆశిస్తున్నట్లు మంత్రి తెలిపారు. 2021-21 బడ్జెట్లో మూలధనం అధిక స్థాయిలో జరిగిందని, అయితే 2022-23 బడ్జెట్ యువత, మహిళలు, రైతులు, ఎస్సీలు, ఎస్టీలకు ఎక్కువ లబ్ధి చేకూర్చనున్నట్లు ఆమె చెప్పారు. పీఎం గతీ శక్తి మాస్టర్ ప్లాన్తో అందరికీ లాభం జరగనున్నట్లు మంత్రి నిర్మల తెలిపారు.