న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ ( Covid Vaccination ) లో కొత్త రికార్డు నమోదు అయ్యింది. దేశంలో ఇప్పటి వరకు 60 కోట్ల కోవిడ్ టీకా డోసులను వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే ఇదే వేగంతో వ్యాక్సినేషన్ జరిగే.. ఈ ఏడాది డిసెంబర్ చివరకు దేశవ్యాప్తంగా 32 శాతం మంది పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇండియాలో రెండు డోసుల వ్యాక్సిన్లు ఇస్తున్న విషయం తెలిసిందే.