US MP Tour in POK | పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు ఇల్హాన్ ఒమర్ పర్యటనను భారత్ గురువారం ఖండించింది. బుధవారం నుంచి మొదలైన పాక్ పర్యటనలో ఇల్హాన్ ఒమర్.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ఖాన్, ప్రస్తుత ప్రధాని షాహబాజ్ షరీఫ్లతో సమావేశం అవుతారు. ఈ సందర్భంగా పీవోకేలో ఇల్హాన్ ఒమర్ పర్యటించడాన్ని ఖండిస్తున్నట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
ఒకవేళ ఆమె సంకుచిత రాజకీయాలు చేసుకోవాలనుకుంటే ఇల్హాన్ ఒమర్ తన స్వదేశంలో చేసుకోవచ్చు కానీ పీవోకేలో పర్యటించాలనుకోవడం తమ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమే. దీన్ని ఖండిస్తున్నాం అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి తెలిపారు.
ఈ నెల 20-24 తేదీల్లో ఇల్హాన్ ఒమర్.. పాక్తోపాటు పీవోకేలో పర్యటించనున్నారు. పాక్లో అమెరికా ప్రతినిధులు పర్యటించినప్పుడల్లా కశ్మీర్ అంశం ప్రధానంగా చర్చకు వస్తుంది. పాక్ ప్రధాని షాహబాజ్ షరీఫ్తో ఇల్హాన్ ఒమర్ చర్చల్లోనూ ఈ అంశం ప్రస్తావనకు రానుందని తెలుస్తున్నది.