న్యూఢిల్లీ : రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇవాళ ఇండియా కూటమి(India Bloc Prostest) నేతలు పార్లమెంట్ ఆవరణలో నిరసన చేపట్టారు. అంబేద్కర్తో లింకు ఉన్న బ్లూ రంగు దుస్తుల్లో ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్కు వచ్చారు. రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు.. బ్లూ రంగు దుస్తులను వేసుకున్నారు. అమిత్ షా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజ్యాంగ నిర్మాతను అవమానించినట్లు ఇండియా కూటమి ఎంపీలు ఆరోపించారు. అంబేద్కర్ ఫోటోలతో ఎంపీలు.. అంబేద్కర్ విగ్రహం నుంచి పార్లమెంట్ ప్రధాన ఎంట్రీ గేటు వరకు ర్యాలీ తీశారు. అంబేద్కర్ పేరును పదేపదే ఉచ్చరించడం ఫ్యాషన్ అయిపోయినట్లు రెండు రోజుల క్రితం రాజ్యసభ ప్రసంగంలో అమిత్ షా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు.
#WATCH | Delhi | MPs of INDIA bloc, led by Lok Sabha LoP Rahul Gandhi and Congress MP Priyanka Gandhi Vadra, hold a protest march from Babasaheb Ambedkar statue at the Parliament premises to Makar Dwar, demanding an apology and the resignation of Union Home Minister Amit Shah… pic.twitter.com/fXOwf7W5Ma
— ANI (@ANI) December 19, 2024