Income Tax Department : కాంగ్రెస్ ఖాతా నుంచి ఆదాయ పన్ను శాఖ రూ. 65 కోట్ల బకాయిలను రికవరీ చేసింది. ఆదాయ పన్ను శాఖకు కాంగ్రెస్ రూ. 115 కోట్ల పన్ను బకాయిలు చెల్లించాల్సి ఉండగా ఐటీ శాఖ రూ. 65 కోట్లు రికవరీ చేసింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతా నుంచి ఈ నిధులను ఐటీ శాఖ రికవరీ చేసింది.
రూ. 65 కోట్ల రికవరీని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇన్కం ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ను ఆశ్రయించి రికవరీకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. బెంచ్ ముందుకు విచారణ ఫలితం కోసం వేచిచూడకుండానే బ్యాంకుల వద్ద కాంగ్రెస్ ఖాతాల్లో ఉన్న డబ్బులో కొంత ఐటీ శాఖ బకాయిల కింద రికవరీ చేసిందని ఫిర్యాదులో పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన స్టే దరఖాస్తు వ్యవహారం తేలేవరకూ ఆదాయ పన్ను శాఖ చర్యలను నిలువరించాలని కోరింది. ఈ వ్యవహరంపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ యథాతథ స్థితి కొనసాగుతుందని ట్రిబ్యునల్ ఆదేశించింది.
Read More :
Covid vaccine | కొవిడ్ టీకాతో గడ్డ కడుతున్న రక్తం.. తేల్చిన తాజా అధ్యయనం..!