కోల్కతా, ఏప్రిల్ 14: ఐటీ శాఖ అధికారులు తమ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ చాపర్లో సోదాలు చేశారని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆదివారం ఆరోపించింది. కోల్కతా బెహలా ఫ్లైయింగ్ క్లబ్లో జరిగిన ఈ ఘటనలో చాపర్ను స్వాధీనం చేసుకుంటామని ఎంపీ సెక్యూరిటీని అధికారులు బెదించారని వెల్లడించింది.
అధికారులు చాలా సేపు సోదాలు చేసి చాపర్ ప్రయాణాన్ని అడ్డుకున్నారని చెప్పింది. ‘ఏదో విధంగా ప్రతిపక్షాలను భయపెట్టి తుదముట్టించి అధికారంలోకి రావాలన్న బీజేపీ ఉద్దేశాన్ని ఈ చర్యలు బహిర్గతం చేస్తున్నాయి’ అని టీఎంసీ పేర్కొంది.