న్యూఢిల్లీ: బైక్పై పారిపోతున్న చైన్ స్నాచర్ను ఒక పోలీస్ కానిస్టేబుల్ ధైర్యంగా పట్టుకున్నారు. ఆ దొంగ అరెస్ట్తో మరో 11 చోరీ కేసులు పరిష్కారమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ మెడలోని బంగారం గొలుసును బైక్పై వెళ్తున్న దొంగ లాక్కొనిపోయినట్లు షహబాద్ డైరీ పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. దీంతో పోలీస్ కానిస్టేబుల్ సత్యేంద్ర వెంటనే తన బైక్పై సంఘటనా స్థలానికి బయలుదేరారు. బైక్పై పారిపోతూ ఎదురుగా వస్తున్న దొంగను గుర్తించిన ఆయన తన బైక్ను స్లో చేశారు. తన బైక్ను వదిలి ఆ దొంగను బలంగా పట్టుకున్నారు. తప్పించుకునేందుకు అతడు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ను ఢిల్లీ పోలీసులు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉన్నప్పటికీ బైక్పై పారిపోతున్న చైన్ స్నాచర్ను ధైర్యంగా పట్టుకుని అరెస్ట్ చేసిన పోలీస్ కానిస్టేబుల్ సత్యేంద్రను పోలీస్ ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఆ దొంగ అరెస్ట్తో మరో 11 చైన్ స్నాచింగ్ కేసులు కూడా పరిష్కారమయ్యాయని తెలిపారు.
మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు కూడా పోలీస్ కానిస్టేబుల్ సత్యేంద్రపై ప్రశంసలు గుప్పించారు. ఆయన ధైర్యసాహసాలను అభినందించారు.
अपनी जान की परवाह किए बगैर शाहबाद डेरी थाने के कांस्टेबल सत्येंद्र ने एक स्नैचर को गिरफ्तार किया।
इस स्नैचर की गिरफ्तारी से 11 मामले सुलझाए गए।
विधिक कार्यवाही जारी है।@dcp_outernorth#HeroesOfDelhiPolice pic.twitter.com/PceBbYpdYQ— Delhi Police (@DelhiPolice) November 24, 2022