హైదరాబాద్, మార్చి2 (నమస్తే తెలంగాణ): డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యుమన్ రిసోర్స్ డెవలప్మెంట్ (ఎంసీఆర్ హెచ్ఆర్డీ)లోని అంతర్గత భద్రత, విదేశీ వ్యవహారాల విభాగం ప్రత్యేక చొరవతో ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన 18 మంది తెలుగు విద్యార్థులు ఉపశమనం లభించింది. హెచ్ఆర్డీ అధికారులు వ్యూహాత్మక కమ్యూనికేషన్ పద్ధతిని ఉపయోగించి అక్కడ చిక్కుకున్న తెలుగు విద్యార్థులను గుర్తించడంతో పాటు, రొమేనియాకు చేరుకునేందుకు తోడ్పాటును అందించారు. దీంతో వారిని శనివారం రోజున భారత్కు తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు హెచ్ఆర్డీలోని సెంటర్ ఫర్ సెక్యూరిటీ స్టడీస్ ఇన్చార్జి డాక్టర్ రమేశ్ కన్నెగంటి బుధవారం వెల్లడించారు.