న్యూఢిల్లీ: మనీల్యాండరింగ్ కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు చెందిన మరో వీడియోను రిలీజ్ చేశారు. తీహార్ జైలులో ఉంటున్న ఆయన.. తన సెల్లోనే అతిథుల్ని కలిశారు. జైన్ను కలిసిన వారిలో సస్పెండ్ అయిన ఆ జైలు మాజీ సూపరింటెండెంట్ ఉన్నారు. సెప్టెంబర్ 12వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో జైన్ సెల్లో కొందరు ముచ్చట్లు పెట్టారు. దానికి సంబంధించిన 10 నిమిషాల వీడియోను రిలీజ్ చేశారు.
జైలు సూపరింటెండెంట్ అజిత్ కుమార్.. జైన్ సెల్లోకి వచ్చిన తర్వాత .. అక్కడ ఉన్న కొందరు బయటకు వెళ్లారు. ఇటీవల సత్యేందర్కు చెందిన వీడియోలను వరుసగా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. సెల్లోనే ఆయన మసాజ్ చేయించుకున్నారు. ఇక రుచికరమైన భోజనం, పండ్లు తీసుకుంటున్న వీడియోను కూడా రిలీజ్ చేశారు.
వచ్చే నెలలో ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఆమ్ ఆద్మీ, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సత్యేందర్ వీడియోలను రిలీజ్ చేస్తున్నారు.
#WATCH | More CCTV visuals of jailed Delhi Minister and AAP leader Satyendar Jain in Tihar jail come out: Sources pic.twitter.com/4c6YdJ2bAL
— ANI (@ANI) November 26, 2022