పుదుచ్చరి: పుదుచ్చరి(Puducherry) సీఎం , ఏఐఎన్ఆర్సీ నేత ఎన్ రంగస్వామి.. తట్టంచావడి అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో ఉన్నారు. ఏప్రిల్ 9వ తేదీన పుదుచ్చరి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. నాలుగు రౌండ్ల కౌంటింగ్ ముగిసే వరకు రంగస్వామి నాలుగు వేల ఓట్ల మెజారిటీతో ఆధిక్యంలో ఉన్నారు. టీవీకే పార్టీ మద్దతు ఇచ్చిన నెయ్యం మక్కల్ కజగం అభ్యర్థి వినాయకం రెండో స్థానంలో కొనసాగుతున్నారు. రంగస్వామికి ఇప్పటికే పది వేలకుపైగా ఓట్లు పోలయ్యాయి. తట్టంచావడి నియోజకవర్గం ఈ ఎన్నికల్లో కీలకంగా నిలిచింది. రాజకీయ పార్టీలు అన్ని ఆ స్థానంపై ఫోకస్ పెట్టాయి. సీఎం రంగస్వామి రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. తట్టంచావడితో పాటు మంగళం సెగ్మెంట్లలో ఆయన పోటీలో నిలిచారు. తాజా సమాచారం ప్రకారం పుదుచ్చరిలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్నార్ కాంగ్రెస్ 11 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 9 స్థానాల్లో, ఎన్డీఏ భాగస్వామి బీజేపీ రెండు స్థానాల్లో లీడింగ్లో ఉన్నది. అన్నాడీఎంకే ఓ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.