రాంచీ: జార్ఖండ్లో ఇంకా కొన్ని ప్రాచీన ఆచారాలు కొనసాగుతున్నాయి. పంట చేతికి వచ్చే సమయంలో స్థానికులు మండ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆ సమయంలో చాలా కఠినమైన రీతిలో దీక్ష చేపడుతారు. వారం రోజుల పాటు ఉపవాసం చేస్తారు. ఆ తర్వాత జరిగే అగ్ని వేడుకలో యువత పాల్గొంటారు. నిప్పులపై నడుస్తారు. దువాసీ వేడుకలో భాగంగా అబ్బాయిలను ఓ వెదురు బార్కు వేలాడదీసి.. మంటపై తలకిందులుగా ఉయ్యాల ఊగుతారు. స్థానిక గిరిజనులు, గిరిజినేతరులు కూడా ఈ అరుదైన వేడుకలో పాల్గొంటారు.
మండ వేడుకను ప్రతి ఏడాది నిర్వహిస్తారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పండుగను నిర్వహిస్తారు. రాజధాని రాంచీకి వంద కిలోమీటర్ల దూరంలోనే ఇలాంటి అనాది వేడుకలు జరుగుతుంటాయి. ఏప్రిల్ నుంచి మే నెలలో .. శివపార్వతుల ఆరాధనలో భాగంగా ఈ వేడుక నిర్వహిస్తారు. ఓరన్,ముండా, మహతో గిరిజన తెగలు మండ పూజలో పాల్గొంటారు. పురుషులు, మహిళా భక్తులు చాలా కఠినంగా వారం రోజుల పాటు ఉపవాస దీక్ష చేపడుతారు.
#WATCH | Ranchi, Jharkhand: People celebrate Manda, a harvest festival, where they undergo a very rigorous ritual of observing a week-long fast and finally walking on and being hanged over a fire. This ritual has been observed from times immemorial by tribals and non-tribals… pic.twitter.com/B1HiGBU1RZ
— ANI (@ANI) April 12, 2024