రాజ్కోట్: గుజరాత్లోని రాజ్కోట్లో వేసవి సెలవులను ఆనందంగా గడపాలనుకున్న బాలలు, పెద్దలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం టీఆర్పీ గేమ్ జోన్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వీరి సంతోషాన్ని ఆవిరి చేసింది. ఈ దారుణ సంఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సందర్శకులంతా ఆటల్లో నిమగ్నమైన సమయంలో మంటలు చెలరేగాయి. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టాలని, గాయపడినవారికి చికిత్స చేయించాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తెలిపారు.
ఛత్తీస్గఢ్లోని బెమెతార జిల్లాలో గన్పౌడర్ తయారీ కర్మాగారంలో శనివారం సంభవించిన పేలుడులో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, ఆరుగురు గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం, ఈ కర్మాగారంలో దాదాపు 100 మంది పని చేస్తున్నారు. ఈ పేలుడు తర్వాత కొందరి ఆచూకీ తెలియడం లేదని సమాచారం.