చండీఘర్ : అన్ని వయసుల వారికి కొవిడ్ బూస్టర్ డోసును ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది కొవిడ్ బూస్టర్ డోసును తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. అయితే బూస్టర్ డోసు తీసుకున్న వారికి రుచిగా ఉండే పూరి చోలేను ఉచితంగా అందిస్తానని చండీఘర్కు చెందిన ఓ వీధి వ్యాపారి ప్రకటించాడు. బూస్టర్ డోస్ తీసుకునే వారి సంఖ్యను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.
గతేడాది కూడా కొవిడ్ టీకా తీసుకున్న వారికి ఉచితంగా పూరి చోలేను అందించి, మోదీ దృష్టిలో పడ్డాడు. టీకా తీసుకున్న తర్వాత మొబైల్కు వచ్చే మేసేజ్ను చూపిస్తేనే చోలే పూరి ఇచ్చేవాడు సంజయ్ రాణా. ఈ వీధి వ్యాపారి ప్రయత్నాన్ని నాడు మోదీ కూడా మెచ్చుకున్నాడు. మన్ కీ బాత్లో కూడా రాణా పేరును ప్రస్తావించి, ప్రశంసలు కురిపించాడు.
బూస్టర్ డోసును తీసుకొని.. కరోనా నుంచి కాపాడుకోవాలని రాణా పిలుపునిస్తున్నాడు. కూతురు, కోడలు ఇచ్చిన ఐడియాతోనే రాణా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అయితే టీకా వేసుకున్న రోజే ఈ పూరి చోలేను ఉచితంగా అందిస్తానని రాణా స్పష్టం చేశాడు.