న్యూఢిల్లీ : కట్టెల మంటపై వంట పాత్ర లేదా కుండలో కాకుండా ప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు వండిన పెద్దావిడ వీడియో(viral video) సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కట్టెల మంటపై ఆమె వండిన తీరు నెటిజన్లలో పలు ప్రశ్నలు రేకెత్తించింది. ది ఫైజెజ్ ట్వి్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 5 లక్షల మందిపైగా వీక్షించారు.
An elementary physics.pic.twitter.com/aqDuNa0Y5G
— The Figen (@TheFigen_) February 23, 2023
ఈ వీడియోలో పెద్ద వయసు మహిళ కట్టెల మంటలపై నీటితో నిండిన ప్లాస్టిక్ బ్యాగ్ను ఉంచడం చూడవచ్చు. అయితే మంట వేడికి ఆ బ్యాగ్ వెంటనే కరిగిపోతుందని ఎవరైనా అనుకోవచ్చు. ప్లాస్టిక్ బ్యాగ్ అంతటి హీట్కూ తట్టుకుని ఉండటం కనిపిస్తుంది. ఆపై నీటిలో ఆమె పలు దినుసులు వేస్తూ చేప, కొద్దిగా మిర్చిని జోడిస్తుంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ప్లాస్టిక్తో కుకింగ్ క్యాన్సర్ ముప్పు పెంచుతుందని పలువురు యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మంట తగిలితే ప్లాస్టిక్ కరిగిపోతుందని అసలు ఇది సాధ్యమా అని మరికొందరు యూజర్లు ప్రశ్నించారు. నీళ్లు పూర్తిగా ఉన్న సమయంలో ప్లాస్టిక్ బ్యాగ్లు ఫైర్ను తట్టుకుంటాయని, అయితే క్యాన్సర్ను మాత్రం అందిస్తాయని మరో యూజర్ రాసుకొచ్చారు.
Read More :