కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో కలుషిత ఆహారం తిని వంద మందికి పైగా అస్వస్ధతకు గురయ్యారు. సుగంధ గ్రామంలోని డొగచియ ప్రాంతంలోని ఓ దుకాణంలో పానీపూరి తిన్న తర్వాత పలువురు అనారోగ్యానికి లోనయ్యారు. వారిలో డయేరియా లక్షణాలు కనిపించాయి.
పానీపూరి తిన్న వారంతా వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న వైద్యారోగ్య శాఖ ప్రత్యేక బృందాలను పంపగా రోగులకు మందులు అందించారు. తీవ్ర అస్వస్దతకు లోనైన వారిని ఈ బృందం గుర్తించి ఆస్పత్రుల్లో చేర్పించింది. స్ట్రీట్ స్టాల్లో పానీపూరి తిని అస్వస్ధతకు గురైన వారిలో డొగచియ, బహిర్ రణగచ, మకల్తల ప్రాంతాలకు చెందిన వారున్నారని అధికారులు గుర్తించారు.