న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధి రేటు 8 శాతం కన్నా ఎక్కువగా ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు దేశానికి వచ్చినట్లు ఆయన చెప్పారు. జీఎస్టీ కలెక్షన్ల విషయంలో గత రికార్డులు అన్నీ బద్దలయ్యారన్నారు. ఎగుమతుల విషయంలో కొత్త అంచనాలు చేరుకున్నామని, వ్యవసాయ రంగంలో రికార్డులు స్థాపించినట్లు ఆయన చెప్పారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 10వ ఇన్స్టాల్మెంట్ విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. 2021లో దేశంలో యూపీఐ పద్ధతి ద్వారా 70 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. ఇండియాలో సుమారు 50 వేలకు పైగా స్టార్టప్లు పనిచేస్తున్నట్లు ప్రధాని చెప్పారు. వాతావరణ మార్పులపై పోరాటాన్ని సాగిస్తున్నామని, 2070 నాటికి కార్బర్ ఉద్గరాల విడుదల జీరోకు తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపై ఉత్పత్తి దృష్టి పెట్టినట్లు ప్రధాని చెప్పారు. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల వివాహ వయసు 18 నుంచి 21 ఏళ్లకు పెంచినట్లు తెలిపారు. గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్తో మౌళికసదుపాయాలను పెంచనున్నట్లు తెలిపారు.