భోపాల్: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. ప్రతిరోజు లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ భారీ సంఖ్యలో వైరస్ బాధితులు పెరిగిపోతున్నారు. మధ్యప్రదేశ్లో కూడా ఒకే రోజు 10 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో 9385 కేసులు రికార్డయ్యాయి. దీంతో రోజువారీ కేసులు వంద నుంచి 10 వేలకు చేరడానికి 19 రోజులు మాత్రమే పట్టింది. దీంతో పాజిటివిటీ రేటు 9.8 నుంచి 11.7 శాతానికి చేరింది.
కరోనా రెండో వేవ్లో రాష్ట్రంలో రోజువారీ కేసులు 150 నుంచి 10 వేలకు చేరుకోవడానికి 77 రోజుల సమయం తీసుకున్నది. జనవరి 6న మధ్యప్రదేశ్లో వెయ్యి కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఐదు రోజుల్లోనే ఆ సంఖ్య 7 వేలు దాటింది. కాగా, గత 20 రోజుల్లో రాష్ట్రంలో కొత్తగా 68 వేల కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు 8,62,029 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 8,01,735 మంది కోలుకున్నారు. మరో 49,741 కేసులు యాక్టివ్గా ఉండగా, 10,553 మంది బాధితులు మృతిచెందారు.