న్యూఢిల్లీ, జూన్ 30: రోడ్డు భద్రత చర్యలు మెరుగుపరిస్తే దేశంలో ఏటా సగటున 30 వేల మంది ప్రాణాలు కాపాడవచ్చని లాన్సెట్ నివేదిక వెల్లడించింది. అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ ధరించకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం వంటి కారణాలతో దేశంలో వేల మంది మరణిస్తున్నారని తెలిపింది. 185 దేశాల్లో సర్వే నిర్వహించిన లాన్సెట్.. ప్రపంచవ్యాప్తంగా 13.5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లోనే చనిపోతున్నారని తెలిపింది. 90% మరణాలు అల్పాదాయ, మధ్య ఆదాయ దేశాల్లోనే చోటుచేసుకున్నట్టు పేర్కొన్నది.