న్యూఢిల్లీ : కొన్ని వెరైటీల బియ్యం ఎగుమతులను భారత్ నిషేధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆహారోత్పత్తుల ధరల్లో ఒడిదుడుకులు నెలకొంటాయని ఐఎంఎఫ్ (IMF) చీఫ్ ఎకనమిస్ట్, డైరెక్టర్ పిరె ఒలివర్ గురించాస్ ఆందోళన వ్యక్తం చేశారు. బియ్యం ఎగుమతులను భారత్ నిషేధించడం ప్రతికూల ప్రభావాలకు దారితీస్తుందని, ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా హానికరంగా పరిణమిస్తున్న క్రమంలో ఈ తరహా ఎగుమతి నియంత్రణలను తొలగించడాన్ని తాము సూచిస్తామని అన్నారు.
ఐక్యరాజ్యసమితి, టర్కీ చొరవతో కుదిరిన బ్లాక్ సీ గ్రెయిన్ డీల్ నుంచి రష్యా బయటకు వస్తున్నట్టు ప్రకటించిన క్రమంలో భారత్ బియ్యం ఎగుమతులను నిషేధించింది. గత ఏడాది ప్రపంచానికి సరిపడా పప్పు ధాన్యాల సరఫరాకు బ్లాక్ సీ గ్రెయిన్ డీల్ ఉపకరించిందని ఐఎంఎఫ్ ముఖ్య సలహాదారు పేర్కొన్నారు. ఉక్రెయిన్ నుంచి ప్రపంచ మార్కెట్లకు ఏకంగా 33 మిలియన్ టన్నుల పప్పు ధాన్యాలు పంపిణీ అయ్యాయని గురించాస్ పేర్కొన్నారు.
ఇది ఆహారోత్పత్తుల ధరలు ఒత్తిడికి లోనవకుండా చేసిందని, ఫలితంగా పప్పు ధాన్యాల ధరలు దిగివచ్చాయని గుర్తుచేశారు. గ్రెయిన్ డీల్ ఇప్పుడు ఉనికిలో లేనందునే భిన్నమైన పరిస్ధితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ధరల పెరుగుదలకు ఇది దారితీసే ప్రమాదం ఉందని అన్నారు. పప్పు ధాన్యాల ధరలు పది నుంచి పదిహేను శాతం పెరిగే అవకాశం ఉందని ఐఎంఎఫ్ ఎకనమిస్ట్ ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Akira Ransomeware | ఇంటర్నెట్ యూజర్లను భయపెడుతున్న .అకిరా.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే తప్పించుకోవచ్చు!