చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీ మద్రాస్ (IIT Madras) క్యాంపస్లో మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రకు చెందిన విద్యార్థి కెమికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం క్యాంపస్లోని హాస్టల్ గదిలో అతడు సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, విద్యార్థి అకాల మరణం తమను తీవ్ర వేదనకు గురిచేసిందని ఐఐటీ మద్రాస్ తెలిపింది. విద్యార్థి మరణానికి కారణం ఏమిటన్నది తెలియలేదని, పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. విద్యార్థి చనిపోయిన సంగతిని అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు వెల్లడించింది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న విద్యార్థులను గుర్తించడానికి, వారికి సహాయం చేయడానికి సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు ఐఐటీ మద్రాస్లో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నెల మొదట్లో పశ్చిమ బెంగాల్కు చెందిన 32 ఏళ్ల పీహెచ్డీ విద్యార్థి హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయాడు. దీనికి ముందు మార్చి నెలలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల విద్యార్థి క్యాంపస్లో సూసైడ్ చేసుకున్నాడు. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో మహారాష్ట్రకు చెందిన రీసెర్చ్ స్కాలర్ కూడా ఐఐటీ మద్రాస్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.