ఖరగ్పూర్: జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదలయ్యాయి. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులను కూడా ఐఐటీ ఖరగ్పూర్ ప్రకటించింది. ఈ ర్యాంకుల ఆధారంగా 23 ఐఐటీలు సహా 114 విద్యాసంస్థల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం విద్యార్థుల కోసం మొత్తం 50 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రేపు అంటే శనివారం నుంచి విద్యాసంస్థల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈనెల 25 వరకూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. 27న సీట్ల కేటాయింపు జరగనుంది.