మంచిర్యాల ఏసీసీ, జూన్ 26:జిల్లా వ్యాప్తంగా శనివారం 2713 మందికి కొవిడ్ టీకాలు ఇచ్చినట్లు జిల్లా వ్యాక్సినేషన్ అధికారి ఫయాజ్ఖాన్ తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో మొదటి డోస్ 2616, రెండో డోస్ 97 మంది టీకా తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాండూర్లో 130 మందికి..
తాండూర్, జూన్ 26 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో శనివారం 130 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి కుమారస్వామి తెలిపారు. 30 మంది ప్రైవేట్, ప్రభుత్వ టీచర్లు, 100 మంది సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ వేసుకొని గడువు నిండిన వారందరూ రెండో డోస్ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ నరేశ్, సిబ్బంది హరీశ్, హకీం, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, సిబ్బంది ఉన్నారు.
కొనసాగుతున్న కరోనా నిర్ధారణ పరీక్షలు
బెల్లంపల్లిరూరల్, జూన్ 26 : బెల్లంపల్లి మండలంలోని తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 60 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 5 పాజిటివ్ కేసులు నమోదైనట్లు హెచ్ఈవో సమ్మయ్య తెలిపారు.
తాండూర్లో నలుగురికి పాజిటివ్
తాండూర్, జూన్ 26 : తాండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 41 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి కుమారస్వామి తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్తే తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించారు. మండలంలో నెల రోజుల నుంచి కరోనా వైరస్ తగ్గుతూ వస్తున్నదని, అయినా నిర్లక్ష్యంగా ఉండరాదన్నారు.