లక్నో : యూనివర్సిటీలో ఉపన్యాసం ఇస్తూ ఐఐటీ కాన్పూర్ సీనియర్ ప్రొఫెసర్ (55) గుండెపోటుతో కుప్పకూలాడు. వర్సిటీ ఆడిటోరియంలో పూర్వ విద్యార్ధుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రొఫెసర్ సమీర్ ఖండేకర్ (IIT Kanpur professor) ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది. విద్యార్ధులు తమ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చివరి మాటలుగా ఆయన చెప్పడం అక్కడున్న వారందరినీ కలిచివేసింది.
మీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ చెబుతూనే అసౌకర్యానికి గురైన కండేకర్ ఛాతీలో నొప్పిగా ఉందని ఫిర్యాదు చేశాడు. ఆపై కొద్దిసేపు కూర్చుండగా ఆయన భావోద్వేగానికి గురయ్యారని ప్రేక్షకులు భావించారు. కొద్దిసేపటికే ఆయన ముఖంపై చెమటలు పట్టగా వేదికపైనే కుప్పకూలారు. ప్రొఫెసర్ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ఖండేకర్ను పరీక్షించిన వైద్యులు ఆయన కార్డియాక్ అరెస్ట్ లేదా కార్డియాక్ బ్లాక్ కారణంగా మరణించారని పేర్కొన్నారు. పోస్ట్మార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని అన్నారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చదువుతున్న ఆయన కుమారుడు తన తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తారని ఖండేకర్ బంధువులు తెలిపారు.
Read More :
California Temple | స్వామి నారాయణ్ ఆలయంపై దాడిని ఖండించిన అమెరికా