న్యూఢిల్లీ: రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గించే కొవిడ్ వ్యాక్సిన్ను ఐఐటీ ఢిల్లీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్.. ఇప్పటి వరకు వచ్చిన పలు ప్రతికూలతలను అధిగమిస్తుందని ఐఐటీ ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ బయోమెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ జయంత భట్టాచార్య పేర్కొన్నారు.
కొవిడ్ వైరస్ నుంచి సమర్థంగా రక్షణ కల్పిస్తుందని, రక్తం గడ్డకట్టడం వంటి సైడ్ ఎఫెక్ట్లను తగ్గిస్తుందని తెలిపారు. తాము ప్రస్తుత వ్యాక్సిన్ల మాదిరిగా కాకుండా, వ్యాక్సిన్ తయారీలో శరీర సొంత రోగ నిరోధక కణాలను ఉపయోగిస్తున్నట్టు వివరించారు.