న్యూఢిల్లీ, ఆగస్టు 13: విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు ఒక సెట్ మిడ్ సెమిస్టర్ పరీక్షను రద్దు చేసినట్టు ఐఐటీ-ఢిల్లీ వెల్లడించింది. చదువుల ఒత్తిడి తదితర కారణాలతో ఇటీవల దేశ వ్యాప్తంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నది.
విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అంతర్గత సర్వే, ఫీడ్ బ్యాక్ ప్రకారం ప్రస్తుత సెమిస్టర్ నుంచే మిడ్-సెమిస్టర్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు ఐఐటీ-ఢిల్లీ డైరెక్టర్ రంగన్ బెనర్జీ తెలిపారు. ఆత్మహత్యల నివారణకు, విద్యార్థుల మానసిక ైస్థెర్యాన్ని పెంచడానికి కౌన్సిలింగ్, మెంటార్ల నియామకం చేపడుతున్నట్టు చెప్పారు.