లక్నో: కేంద్ర ప్రభుత్వం దళిత నేతలను విస్మరించడం తగదని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) అన్నారు. దళితుల ఆశాకిరణం కాన్షీరామ్కు భారతరత్న ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడాన్ని మాయావతి స్వాగతించారు. అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దళిత నేతలను నిర్లక్ష్యం చేసిందని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టిసారించాలని అన్నారు.
కాగా, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ‘బాబా సాహెబ్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ను వీపీ సింగ్ ప్రభుత్వం భారతరత్న బిరుదుతో సత్కరించిందని మాయావతి గుర్తు చేశారు. ఆయన తర్వాత దళిత దూతలు నిర్లక్ష్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవనీయులైన కాన్షీరామ్ చేసిన పోరాటం, దళితుల ప్రయోజనాల దృష్ట్యా ఆయనను కూడా భారతరత్నతో సత్కరించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేశారు. బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించినప్పుడు కూడా కాన్షీరామ్కు భారతరత్న డిమాండ్ను మాయావతి ప్రస్తావించారు.
2. बाबा साहेब डा. भीमराव अम्बेडकर को लम्बे इंतजार के बाद श्री वी पी सिंह जी की सरकार द्वारा भारतरत्न की उपाधि से सम्मानित किया गया। उसके बाद दलित व उपेक्षितों के मसीहा मान्यवर श्री कांशीराम जी का इनके हितों में किया गया संघर्ष कोई कम नहीं। उन्हें भी भारतरत्न से सम्मानित किया जाए।
— Mayawati (@Mayawati) February 9, 2024