న్యూఢిల్లీ: కశ్మీర్ పండిట్ల హింస గురించి ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫారూక్ అబ్దుల్లా స్పందించారు. పార్లమెంట్ ఆవరణలో ఆయన్ను మీడియా ప్రశ్నించగా.. ఆ సమయంలో ఆయన రియాక్ట్ అవుతూ.. కశ్మీర్ పండిట్ల హింస గురించి తెలియాలంటే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆ ఊచకోతకు ఎవరూ బాధ్యులో ఆ కమిషన్ చెబుతుందని ఆయన అన్నారు. మీకు నిజం తెలియాలంటే, మీరు కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల రిలీజైన్ కశ్మీర్ ఫైల్స్ చిత్రం తీవ్ర వివాదం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. 1990 దశకంలో కశ్మీర్ పండిట్లను ఊచకోత కోశారు. దాంతో వాళ్లు వలస బాటపట్టారు. ఆ సమయంలో ఆ రాష్ట్ర సీఎంగా ఫారూక్ ఉన్నారు.
#WATCH | Delhi: National Conference president Farooq Abdullah speaks on questions on Kashmiri Pandits. He says, "I think they (BJP-led Central Govt) should appoint a commission & that'll tell them who is responsible…You want to know the truth, you should appoint a commission." pic.twitter.com/kPFBbmWQKJ
— ANI (@ANI) March 22, 2022