న్యూఢిల్లీ, ఆగస్టు 7: సాధారణంగా వాకింగ్ అంటే పొద్దున్నే నిద్ర లేవగానే చేస్తారు. కానీ, ఆహారం తీసుకొన్న వెంటనే కొద్దిదూరం నడిస్తే కూడా మంచి ఫలితాలు ఉంటాయని పరిశోధకులు అంటున్నారు. తిన్న తర్వాత వాకింగ్ చేస్తే డయాబిటిక్ రోగుల శరీరంలో షుగర్ స్థాయిలో నియంత్రణలో ఉంటాయని స్పోర్ట్స్ మెడిసిన్ అనే జర్నల్లో ప్రచురితమైన కథనంలో పరిశోధకులు తెలిపారు. ఈ విధానం భారతీయులకు అమితంగా ఉపయోగపడుతుందని ఫోర్టిస్ సీ-డాక్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ డయాబెటిక్ చైర్పర్సన్ అనూప్ మిశ్రా అభిప్రాయపడ్డారు.