గువాహటి, ఏప్రిల్ 11: హిందీ భాషను పదోతరగతి వరకు తప్పనిసరి సబ్జెక్టుగా చేయడానికి ఈశాన్య భారత రాష్ర్టాలు ఒప్పుకొన్నాయన్న కేంద్రమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను ఈశాన్య రాష్ర్టాల్లోని రాజకీయ పార్టీలు, రాజకీయేతర సంస్థలన్నీ తీవ్రంగా ఖండించాయి. హిందీని తప్పనిసరి చేస్తే స్థానిక భాషలు ప్రమాదంలో పడతాయని అస్సాం సాహిత్య సభ ఆందోళన వ్యక్తం చేసింది. హిందీపై కేంద్రం నుంచి ఆదేశాలు రాలేదని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ చెప్పారు. ‘ఈశాన్య భారతంలో 9 గిరిజన తెగలు తమ భాషను దేవనాగరి లిపిలో రాస్తున్నాయి. 8 రాష్ర్టాలు హిందీని 10వ తరగతి వరకు తప్పనిసరి సబ్జెక్టుగా చేయడానికి ఒప్పుకొన్నాయి’ ఇటీవల షా అన్నారు.