Kavach | న్యూఢిల్లీ: బాలాసోర్ రైలు మార్గంలో యాంటీ కొలిజన్ వ్యవస్థ ‘కవచ్’ ఏర్పాటుకు పెద్దమొత్తంలో నిధులు కేటాయించినా, దీంట్లో నుంచి కనీసం ఒక్క రూపాయి కూడా సౌత్ ఈస్ట్రన్ రైల్వే జోన్ ఖర్చు చేయలేదని వెల్లడైంది. ఈ స్వదేశీ సాంకేతికతను అనుసంధానం చేసేందుకు సౌత్ ఈస్ట్రన్ రైల్వే (బాలాసోర్ మార్గం దీని కిందకే వస్తుంది)కు రూ.468.9 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. మూడేండ్లలో ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయలేదని, పనుల కోసం టెండర్లు పిలవలేదని తేలింది. మరోవైపు ప్రమాదం జరిగిన మార్గంలో రైళ్ల రాకపోకలను ఆదివారం రాత్రి పునరుద్ధరించారు.
మృతుల కుటుంబాలకు ఉద్యోగం: మమత
మృతుల కుటుంబ సభ్యులకు, కాళ్లు పోగొట్టుకొని తీవ్రంగా గాయపడ్డ వారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. రైలు దుర్ఘటనపై ఒడిశా పోలీసులు కేసు నమోదుచేశారు. ‘నిర్లక్ష్యంతో మరణాలకు కారణమవ్వడం’ వంటి అభియోగాలతో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.