లక్నో: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీని, సీబీఐని అడ్డం పెట్టుకుని తప్పుడు కేసులతో ప్రతిపక్ష పార్టీల నేతలను వేధించడం అలవాటుగా మారింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ఎంతో మంది కీలక నాయకులపై కేసులు పెట్టి ఈడీ, సీబీఐ వేధిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రివాల్కు లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులు ఇచ్చింది. నవంబర్ 2న విచారణకు హాజరుకావాలని ఆ నోటీస్లలో పేర్కొన్నది.
దీనిపై ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. బీజేపీ సర్కారు తీరుపై వ్యంగ్యస్త్రాలు సంధించారు. బీజేపీ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తే కేజ్రివాల్కే కాదు, ప్రతి ఒక్కరికి ఈడీ నోటీసులు వస్తాయన్నారు. ఒకవేళ దేశంలోని 140 కోట్ల బీజేపీపై విమర్శలు చేస్తే.. వాళ్లందరినీ కూడా ఈ ప్రభుత్వం జైళ్లలో పెడుతుందని అఖిలేష్ యాదవ్ ఎద్దేవా చేశారు.
#WATCH | On ED summon to Delhi CM Arvind Kejriwal, Samajwadi Party Chief Akhilesh Yadav says, “Everyone will get this notice… If 140 crore people are angry, then will the government send them all to jail?…” pic.twitter.com/g3YV8eTpGx
— ANI (@ANI) October 31, 2023