ఢిల్లీలోని సీమాపూరిలో ఓ అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ బ్యాగులో భారీగా ఐఈడీ బాంబులు ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం కూడా తెలిసిందే. ఈ ఘటనపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేశ్ ఆస్థానా స్పందించారు. ఢిల్లీలో రద్దీగా ఉన్న ప్రాంతాల్లో పేల్చడానికే వీటిని తయారు చేశారని ఆయన తెలిపారు. అయితే స్థానికంగా ఎంతో మద్దతు ఉంటే తప్ప ఇలాంటి పేలుళ్లకు వ్యూహ రచన చేయడం సాధ్యం కాదని అన్నారు.
ఈ ఘటనపై స్పెషల్ టీం తో పాటు ఇతర పోలీసు బృందాలు కూడా దర్యాప్తు చేస్తున్నాయని వెల్లడించారు. అలాగే మరిన్ని ఇళ్లను సోదించే పనిలో ఉన్నామని, ఇలాంటి వాటిని అడ్డుకోవడానికి సాయశక్తులా పనిచేస్తున్నామని అన్నారు. ఇక… ఇలాంటి ఘటనల వెనుక ఉన్న దేశీయ, విదేశీయ నెట్వర్క్లను ఛేదించే పనిలో తాము నిమగ్నమై ఉన్నామని సీపీ పేర్కొన్నారు.