న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా మార్చి 23వ తేదీన రిటైర్ కానున్నారు. అయితే ఆ స్థానం కోసం 32 మంది రేసులో ఉన్నారు. దాంట్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బల్రామ్ భార్గవ్ ముందంలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భార్గవ్ ఉన్నత పదవిలో ఉన్నారు. దాంతో పాటు ఆ రంగంలో ఆయనే సీనియర్. ఎయిమ్స్ డైరెక్టర్ హోదాలో భార్గవ్ తల్లి డాక్టర్ స్నేహ భార్గవ 1984 నుంచి 1990 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పటి వరకు ఎయిమ్స్ చరిత్రలో దానికి డైరెక్టర్గా చేసిన ఏకైక మహిళా ఆమే. ఎయిమ్స్ డైరెక్టర్ రేసులో ఉన్న వారిలో 12 మంది డాక్టర్లు ఉన్నారు. ఎంవీ పద్మా శ్రీవాత్సవ్, నిఖిల్ టండన్, రాకేశ్ మల్హోత్రా, సునీల్ చుంబర్లు ఎయిమ్స్ పోటీలో ఉన్నారు.