Venugopal Dhoot | ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణ మోసం కేసులో వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్కు బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గత నెల 26న సీబీఐ ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
రుణ మోసం కేసులో.. వీడియోకాన్ గ్రూప్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ దాఖలు చేసిన రిట్ పిటిషన్పై బాంబే హైకోర్టు 13న ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. సీబీఐ తన అరెస్టును వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు రుణాల మోసం కేసులో పారిశ్రామికవేత్త విచారణకు సహకరిస్తున్నందున అరెస్టు చేయడం సరికాదని వీడియోకాన్ గ్రూప్ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్ తరఫున న్యాయవాది గతవారం బాంబే హైకోర్టులో వాదనలు వినిపించారు. మరోవైపు దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు ధూత్ ప్రయత్నిస్తున్నాడని (సీబీఐ) పేర్కొంది.
రుణం మోసం కేసులో వేణుగోపాల్ ధూత్ను 2022 డిసెంబర్ 26న సీబీఐ అరెస్టు చేయగా.. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. తనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని, మధ్యంతర బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అంతకు ముందు సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది.