(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): అగ్ని పర్వతంలోని లావాతో విద్యుత్తు ఉత్పత్తి చేస్తామని క్వాయిన్ ఎనర్జీ అనే అమెరికన్ స్టార్టప్ కంపెనీ చెప్తున్నది. అగ్ని పర్వతం శిలాద్రవం గదిలోకి రంధ్రం చేసి, భూ ఉపరితలంపై ఏర్పాటు చేసిన టర్బైన్ల ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని చెప్తున్నది.
వాతావరణ కాలుష్యం కలిగించని ఈ క్రాప్లా మాగ్మా టెన్ట్బెడ్ (కెబీటీ) ప్రాజెక్టును 2026లో ప్రారంభించనున్నట్లు తెలిపింది.