రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో జరిగిన బొగ్గు కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిణి రాణు సాహూని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. మూడు రోజుల ఈడీ కస్టడీకి అనుమతిస్తూ స్థానిక కోర్టు ఉత్తర్వులిచ్చింది. కోర్బా కలెక్టర్గా బొగ్గు ఎగుమతుల్లో అవకతవకలు జరిగినట్టు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. టన్ను ఎగుమతికి రూ.25 లెవీ వసూలు చేసినట్టు ఈడీ ఆరోపించింది. ఆమె ఇంట్లో తనిఖీ చేయగా 5.52 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్టు గుర్తించామని ఈడీ కోర్టుకు తెలిపింది.