ఐజ్వాల్, డిసెంబర్ 6: దేశంలోనే తొలి మహిళా ఏడీసీ (ఎయిడ్ డీ క్యాంప్)గా ఇండియన్ ఎయిర్పోర్స్కు చెందిన అధికారిణి మనీశా పాధీ నియమితులయ్యారు. 2015 బ్యాచ్కు చెందిన మనీషాను మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు ఇటీవల తనకు ఏడీసీగా నియమిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
వెంటనే ఉద్యోగంలో చేరిన ఆమె గత నెల 29న గవర్నర్కు రిపోర్టు చేశారు. ఐజ్వాల్లోని రాజ్భవన్లో ఉన్న అధికారులు, సిబ్బందికి తనను పరిచయం చేసుకొన్నారు. ఐడీసీగా నియమించకముందు.. మనీశా బీదర్, పుణే, బఠిండా ఎయిర్ఫోర్స్ స్టేషన్లలో పనిచేశారు. భారత్లో ఎయిర్ డీ క్యాంప్ను గౌరవ బిరుదుగా పేర్కొంటారు. రాష్ట్రపతికి ఐదుగురు ఏడీసీలు ఉంటారు. అదే విధంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ చీఫ్లకు ముగ్గురు చొప్పున ఏడీసీలు ఉంటారు.