చెన్నై : సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, సహా 14 మంది ప్రయాణిస్తున్న ఐఏఎఫ్కు చెందిన హెలికాప్టర్ బుధవారం తమిళనాడులోని కూనూర్లో కూలిపోయిన విషయం తెలిసిందే. జనరల్ బిపిన్ రావత్ సహా 13 మంది దుర్మరణం పాలయ్యారు. గురువారం సంఘటనా స్థలాన్ని ఐఏఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో కలిసి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన స్థలాన్ని సందర్శించారు. ఆర్మీకి చెందిన అధికారులు ఆయనకు వివరాలు తెలిపారు. మరో వైపు కూలిపోయిన హెలికాప్టర్కు సంబంధించిన బ్లాక్ బాక్ కోసం వింగ్ కమాండర్ భరద్వాజ్ శోధిస్తున్నారు. ఈ బ్లాక్ బాక్స్లో 13 గంటల పాటు నిడివి ఉన్న డేటా నిక్షిప్తమై ఉంటుంది. క్రాష్ అయిన సమయంలో మాత్రం ప్రమాదానికి ముందు అరగంట ముందు ఏం జరిగిందన్న సమాచారం తెలియనున్నది.