RajBhar on Akhilesh | ఏసీ రూమ్ల్లోంచి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ను బయటకు తీసుకొస్తానని ఆయన మిత్రపక్షం సుహెల్దేవ్ భారతీయ సమాజ్పార్టీ (ఎస్బీఎస్పీ) అధినేత ఓం ప్రకాశ్ రాజ్భర్ పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన యూపీ అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందు ఎస్పీతో ఎస్బీఎస్పీ జట్టు కట్టిన సంగతి తెలిసిందే.
తాను ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎస్పీని వీడబోనని ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఓం ప్రకాశ్ రాజ్భర్ చెప్పారు. ఇటీవలి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్భర్ సారధ్యంలోని ఎస్బీఎస్పీ ఆరు స్థానాలు గెలుచుకున్నది. అఖిలేశ్ యాదవ్తో మితృత్వాన్ని తెగదెంపులు చేసుకుంటానని వచ్చిన వదంతులను రాజ్భర్ కొట్టి పారేశారు. తుది శ్వాస విడిచే వరకూ కూటమిలోనే కొనసాగుతానని చెప్పారు.
వందశాతం దృఢ నిశ్చయంతో ఈ మాట చెబుతున్నానని ఓం ప్రకాశ్ రాజ్భర్ అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల వరకు తమ కూటమి కొనసాగుతుందని, తమ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయన్నారు. ఎస్పీ అధినేత ప్రజల్లోకి రావాలని ఆయన సొంత పార్టీ నేతలే కోరుకుంటున్నారన్నారు. తూర్పు యూపీలో ఇతర బీసీ కులాల్లో పట్టున్న నాయకుడు రాజ్భర్.