చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సోదరుడు మనోహర్ సింగ్కు టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. దీంతో ‘తగ్గేదేలే’ అంటున్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించారు. సీఎం సోదరుడైన మనోహర్ సింగ్, బస్సీ పఠానా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుఫున అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్కు ఆ స్థానాన్ని కాంగ్రెస్ ఖరారు చేసింది. ఈ మేరకు అభ్యర్థుల తొలి జాబితాను శనివారం విడుదల చేసింది.
మరోవైపు కాంగ్రెస్ టికెట్ నిరాకరణపై సీఎం చన్నీ సోదరుడు డాక్టర్ మనోహర్ సింగ్ చన్నీ ఆదివారం స్పందించారు. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం నియోజకవర్గం ప్రజలకు చాలా అన్యాయమని అన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయమని చాలా మంది తనను కోరుతున్నారని అన్నారు. ప్రజల అభిష్టం మేరకు తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. దీనిపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. తన అన్నతో మాట్లాడి ఒప్పిస్తానని తెలిపారు. 2007లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన సంగతిని ఆయన గుర్తు చేశారు.