న్యూఢ్లిల్లీ, జూన్ 25: దేశవ్యాప్తంగా పలు చోట్ల యాపిల్ ఐఫోన్లకు చార్జింగ్ పూర్తిగా కావట్లేదు. 80 శాతం వరకు మాత్రమే చార్జింగ్ అవుతున్నది. ఇందుకు దేశంలో అధిక ఉష్ణోగ్రతలే కారణమని నిపుణులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో చార్జింగ్ అయితే ఫోన్ వేడెక్కే ప్రమాదం ఉందని, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు దానంతట అదే చార్జింగ్ ఎక్కే శాతం తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఈ ఫీచర్ యాపిల్ ఐఫోన్లలో డిఫాల్ట్గా ఉంటుందని సంస్థ వెల్లడించింది.
సున్నా నుంచి 35 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య చార్జింగ్ పూర్తిగానే అవుతుందని, సున్నాకు తక్కువ ఉన్నా, 35 డిగ్రీలు దాటినా వెంటనే ఫోన్లోని సాఫ్ట్వేర్ స్పందించి చార్జింగ్ ఎక్కే విషయంలో మార్పులు చేస్తుందని వివరించింది. ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ పూర్తిస్థాయిలో చార్జింగ్ అవుతుందని తెలిపింది