న్యూఢిల్లీ, నవంబర్ 2: యాపిల్ ఐఫోన్ యూజర్లకు 5జీ సర్వీసులు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. కొత్త మోడళ్ల ఐఫోన్ యూజర్ల కోసం తన బీటా ప్రోగ్రామ్ అప్డేట్తో వచ్చే వారం 5జీ సర్వీసును ప్రారంభించనున్నట్టు టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ బుధవారం ప్రకటించింది.
ఐఓఎస్ 16 బీటా సాఫ్ట్వేర్ అప్డేట్ను డౌన్లోడ్ చేసుకొన్న ఎయిర్టెల్, జియో కస్టమర్లు 5జీ సర్వీసును ఎంజాయ్ చేయవచ్చునని, ఫైనల్ అప్డేటెట్ సాఫ్ట్వేర్ డిసెంబర్లో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 14,13,12 సిరీస్లు, ఐఫోన్ ఎస్ఈ (థర్డ్ జనరేషన్) హ్యాండ్సెట్లలో 5జీ కోసం ఈ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంటుంది.